మంచిర్యాల జిల్లా కేంద్రం లో పర్యటించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.

Madupa Santhosh CEO
మంచిర్యాల: అక్షరతెలంగాణ :  మంచిర్యాల జిల్లా కేంద్రం లో పర్యటించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.  తెలంగాణ రాష్ట్రంలో జరుగనున్న 
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ని తాండ్ర పాపారాయుడు ఫంక్షన్ హాల్ లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్,పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజి రెడ్డి
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి,సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, రఘునాథ్ వెరబెల్లి,రావుల రామనాథ్,చల్లా నారాయణ రెడ్డి పాల్గొన్నారు.
ఈ. సందర్భంగా  కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఫిబ్రవరి 27న జరుగనున్న ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలనీ అయన అన్నారు.బిజెపి అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ కుల గణన పేరుతో బీసీలను మోసం చేస్తుందని హిందువుల జనాభా తక్కువ చేసే చూపే ప్రయత్నం చేస్తుందని బీసీలు అందరూ ఏకం అయ్యి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ది పాఠం చెప్పాలనీ అన్నారు.
Comments