తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి

Madupa Santhosh CEO
అదిలాబాద్ : అక్షరతెలంగాణ :తాగునీటి సరఫరా సమస్యల పరిష్కారానికై కంట్రోల్ రూమ్ ఏర్పాటు  టోల్ ఫ్రీ నెంబర్ 18005994007 ద్వారా కూడా ప్రజలు తాగునీటి సమస్య ల పై ఫిర్యాదు చేసి సమస్యలను పరిష్కరించుకోవాలి :
విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తితే టోల్ ఫ్రీ నెంబర్ 1912 కు ఫిర్యాదు చేయాలి:

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం ఐదు ప్రధాన అంశాల పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పాలనాధికారి రాజర్షి షా, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా పాల్గొన్నారు.

త్రాగునీరు, రేషన్ కార్డుల, విద్యుత్, రైతు భరోసా,  ఇరిగేషన్ రబీ క్రాఫ్  ల కు సంబంధించిన అంశాల పై 
 సి. ఎస్ ఆన్ని జిల్లాల కలెక్టర్లతో  మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా  CS. మాట్లాడుతూ  రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఎక్కడ కూడా తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి సూచించారు. ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైతే, సత్వరమే పరిష్కరించాలని , ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ మంచినీటి సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా  ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా కలెక్టరేట్ లోని   వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్ రాజర్షి షా,  ఐటిడిఎ పిఓ ఖుష్బూ గుప్తా  , ట్రైనీ కలెక్టర్ అభిగ్యాన్,  ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. 

రానున్న వేసవి కాలంలో  త్రాగునీరు, విద్యుత్ లో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా నిరంతరం తాగునీటి  సరఫరా, విద్యుత్ సౌకర్యం కల్పించాలని, అధికారులు అనునిత్యం నిశితంగా పర్యవేక్షించాలని, ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు.   
జలాశయాలలో నీటి నిల్వలు అందుబాటులో ఉన్నందున వేసవిలో నీటి ఎద్దడి నెలకొనకుండా, లీకేజీలకు తావులేకుండా మంచినీటి సరఫరా వ్యవస్థను పటిష్టపర్చాలని సూచించారు. తాగునీటి సరఫరాకు సంబంధించిన సమస్యల పరిష్కారానికై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, టోల్ ఫ్రీ నెంబర్ 18005994007 ద్వారా కూడా ప్రజలు తాగునీటి సమస్య గురించి ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. క్షేత్ర స్థాయిలో ఏర్పడే ఇబ్బందులను పరిష్కరించేందుకు అవసరమైన బృందాలను ఏర్పాటు చేయాలని, తాగునీటి సరఫరాకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి క్రమం తప్పకుండా సమాచారం సేకరించాలని కలెక్టర్లకు సూచించారు. అన్ని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు మిషన్ భగీరథ జలాలను సరఫరా చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని, స్థానికంగా అందుబాటులో ఉన్న జల వనరులను వేసవి సీజన్ చివరలో వినియోగించుకునేందుకు వీలుంటుందని అన్నారు. పట్టణాలలో ఏర్పడిన నూతన కాలనీలు, చివరి ఆవాస ప్రాంతాలలో  తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని, ఇబ్బందులు ఉన్న ప్రాంతాలకు ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కోసం ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు. అదేవిధంగా రబీ పంటలు చేతికందే వరకు సాగు నీటి వసతి కల్పించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. 

సాగు, తాగునీటి పథకాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రానున్న మార్చి, ఏప్రిల్, మే మాసాలలో విద్యుత్ వినియోగం పెరిగే అవకాశాలు ఉన్నందున ముందస్తుగానే ప్రణాళికలు రూపొందించుకుని వ్యవసాయానికి, గృహావసరాలకు, పరిశ్రమలకు కోతలు లేకుండా  కరెంటు సరఫరా చేయాలని సూచించారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్ ఉత్పాదకత ఉన్నందున, సరఫరా లోపాలను సవరించుకుని ఆయా రంగాలకు కోతలు లేకుండా విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1912 కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. కాగా, సాగుకు యోగ్యమైన వ్యవసాయ భూమి కలిగి పంటలు పండిస్తున్న ప్రతి రైతుకు రైతు భరోసా కింద ఆర్ధిక తోడ్పాటును అందించేందుకు చొరవ చూపాలన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన గ్రామ సభలు, ఇతరత్రా మార్గాల ద్వారా వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను సత్వరమే పూర్తిచేసి, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ అయ్యేలా వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయించాలని సూచించారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పక్కాగా మెనూ అమలయ్యేలా పర్యవేక్షణ జరపాలని అన్నారు. 

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం  జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడుతూ రానున్న వేసవి దృష్ట్యా ఎక్కడ కూడా నీటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా ఆన్ని చర్యలు తీసుకోవాలని , 97  
హ్యాబిటెష న్ లలో  త్రాగునీటి కి ఇబ్బందులూ ఉన్న వాటిని గుర్తించి బోర్ వెల్స్ రిపేర్, వాల్స్, పైప్ లైన్, తదితర  మరమ్మత్తులు చేయించాలని ఆన్నారు.
ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి నివేదిక సమర్పించాలని rws అధికారిని ఆదేశించారు.

ముఖ్యంగా ఇంద్రవెల్లి, గాదిగూడ, ఉట్నూర్, అదిలాబాద్ రూరల్ లో ఎక్కువగా focas చేయాలనీ, బ్లీచింగ్ పౌడర్, క్లోరినేషన్ వేయాలని సూచించారు.
నీటి సమస్య ఎక్కువగా ఉన్నచోట ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని, ఈ వేసవిలో ప్రజలకు నీటి ఎద్దడి సమస్యలు కలగకుండా  చూడాలని ఆన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  rdo వినోద్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు , తదితరులు పాల్గొన్నారు. 
Comments