అదిలాబాద్: అక్షరతెలంగాణ : ఎస్ బి ఐ ప్రధాన బ్యాంకు లో బైఠాయించి రైతుల నిరసన
బ్యాంక్ ఖాతాలో పత్తి అమ్మగా వచ్చిన డబ్బులు రైతులకు చెల్లించకుండా బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆదిలాబాద్ పంజాబ్ చౌక్ ఎస్ బి ఐ బ్యాంకులో(SBI ) రైతులు నిరసన చేపట్టారు.
ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్ గూడకు చెందిన నల్ల విలాస్, తంతోలీకి చెందిన జగదీష్ తో పాటు భీంపూర్ మండలం మోహన్ అనే రైతులు గతేడాది సీసీఐకి (CCI) పత్తిని విక్రయించారు. ముగ్గురు రైతులకు సంబంధించిన రూ.3.76 లక్షలు ఆదిలాబాద్ ప్రధాన పోస్ట్ ఆఫీస్ లో జమ అయ్యాయి. పోస్ట్ ఆఫీస్ సిబ్బంది నిర్లక్షం కారణంగా డబ్బుల పంపిణీని లిచిపోయింది.
అనంతరం విచారణ జరిపిన అధికారులు రైతులకు సంబంధించిన డబ్బులు వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. కాగా, తమ డబ్బులను ఇవ్వాలంటూ రైతులు ఏడాది కాలంగా బ్యాంక్ చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా స్పందించలేదు. దీంతో రైతులు విసుగుచెంది ఆగ్రహంతో బ్యాంకులోనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసుల జోక్యంతో బ్యాంకు అధికారులు, ఎస్ బి ఐ ఉన్నత అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరానికి చర్యలు చేపట్టారు. సైబర్ క్రైమ్ కేసు వల్ల ముగ్గురు రైతులకు సంబంధించిన అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయని బ్యాంక్ అధికారులు తెలిపారు. తొందరలోనే పోలీసు అధికారులతో మాట్లాడి తొందరలోనే సమస్యను పరిష్కరిస్తామని బ్యాంక్ అధికారులకు హామి ఇచ్చారు .
Comments