మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని అంగరంగ వైభవంగా మూడు రోజులగా జరుగునున్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి జాతర
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి జాతర మహోత్సవాలు ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరుగును. ఫిబ్రవరి 25న రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారికి వస్త్రాలంకరణ, కోడె మొక్కులు నిర్వహిస్తారు. 26న మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 27న స్వామివారి ఆర్జిత సేవలు ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు భక్తు ల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
Comments