అదిలాబాద్ రూరల్ తాటిగూడ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్రోగ్రాం ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా.
అదిలాబాద్ : అక్షరతెలంగాణ
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాథమిక తరగతుల విద్యార్థుల కోసం వారు చదువులో ముందుండటానికి వినూత్న కార్యక్రమాలు చేపటుతున్నదని అందులో భాగంగానే మొదట 6 జిల్లాల్లో ఏ ఐ ఆధారిత ఆన్లైన్ లెర్నింగ్ ప్రాసెస్ ప్రారంభించిందన్నారు.
అక్కడ విజయవంతం కావటంతో మిగిలిన 27 జిల్లాల్లో తేది 15 శనివారం. నుండి నాలుగు ప్రైమరీ స్కూల్ లో ప్రారంభించారు..
ఈకే స్టెప్ అనే ఆర్గనైజేషన్ తో కలిసి ఏఎక్స్ఎల్అనే ఏ ఐ ఆధారిత వెబ్సైట్ ద్వారా విద్యార్ధులకు బోధించడం జరుగుతుందని అన్నారు.
ఈ సందర్భంగా తల్లిదండ్రులు విద్యార్ధుల చదువుపట్ల అశ్రద్ధ చేయకుండా ప్రతీ రోజూ పాఠశాలలకు పంపించాలని ఆన్నారు.
ఏఐ ద్వారా భాషలలో,గణితంలో వెనుకబడిన విద్యార్థులను తక్కువ సమయంలో సి గ్రేడ్ నుండి ఏ గ్రేడ్ కు మార్చవచ్చని ఏఐ గురించి పేరెంట్స్ కు వివరించారు.
డి ఈ వో ప్రణీత, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నారాయణ ,కోర్సు ట్రైనీ, ఎం ఈ వో మనోహర్ , ఏ ఎస్ వో ,ట్రైనీ గణేష్ , తదితరులు పాల్గొన్నారు.
Comments