ADB: రైతులు ఆందోళన చెందనవసరం లేదు. అందరికీ న్యాయం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ రాజర్షి షా: అదిలాబాద్ : అక్షరతెలంగాణ
భూ భారతి చట్టం పై అవగాహన సదస్సు ఉదయం సాత్నాల మండలం కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
మధ్యాహ్నం తలమడుగు మండలం ఆయుష్ గార్డెన్ లలో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా కార్యక్రమాన్ని సాత్నాల, తలమడుగు మండలాల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ట్రైనీ కలెక్టర్ సలోని, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, డిసిసిబి చైర్మన్ భోజారెడ్డి, తహసీల్దార్లు రాజేశ్వరి, రాజ్ మోహన్ లు జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా. ఆయా మండల రైతులు భూమి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
తెలంగాణ కొత్త భూ భారతి చట్టం లో రైతుల సమస్యల పరిష్కారానికి రూపొందించిన చట్టం అని అందరికీ న్యాయం జరిగేలా చట్టం రూపొందించబడిందని రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందనవసరం లేదని రైతుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు.
నూతన చట్టాన్ని ఏప్రిల్ 14వ తేదీ న అమలులోకి వచ్చిందని, దీని ఫలితంగా తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయని ఆన్నారు.
భూ భారతి పోర్టల్ ఏప్రిల్ 14వ తేదీన హైదరాబాద్లోని శిల్పకళా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతులు మీదుగా కొత్త చట్టంతో పాటు భూ భారతి పోర్టల్ను కూడా ఆవిష్కరించారని, ఈ నెల 17 వ తేదీ నుంచి 30 వ తేది వరకు ఆన్ని మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి , రైతులు ఈ చట్టం లో ఉన్న అంశాలను తెలుసుకొని, సదస్సులో తెలుసుకున్న విషయాలను గ్రామాలలో ఉన్న ప్రజలకు అవగాహన కల్పించాలని ఆన్నారు.
ధరణి’ స్థానంలో భూ-భారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చిందని,భూ భారతి పోర్టల్ ద్వారానే క్రయవిక్రయాలు జరుగుతాయన్నారు. ఈ చట్టం లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయని
భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి గతంలో పోర్టల్లో 33 మాడ్యూళ్లు ఉండేవి. అయితే భూ భారతిలో ఈ విధానాన్ని సులభతరం చేశారని, మాడ్యూళ్ల సంఖ్యను 33 నుంచి ఆరు కు కుదించారన్నారు.
ఈ నూతన చట్టం ప్రకారం మ్యుటేషన్కు మ్యాప్ తప్పనిసరిగా ఉంటుందని, వారసత్వ భూముల విషయంలో తప్పులు జరగకుండా చర్యలు, క్షేత్రస్థాయి విచారణ తర్వాతే ప్రక్రియ ముందుకు సాగుతుందని, నిర్ణీత కాలంలో విచారణ చేసిన తర్వాతనే పాస్ పుస్తకాలు జారీ అవుతాయన్నారు
అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, డిసిసిబి చైర్మన్ భోజరెడ్డి లు మాట్లాడుతూ భూ భారతి చట్టం లో భూమి హక్కులు భద్రం, భూ సమస్యల సత్వర పరిష్కారం కొరకు రైతు మేలు కోసం ప్రజాపాలన లో చారిత్రక మార్పు వచ్చిందని వెల్లడించారు. ఈ చట్టం ద్వారా అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు
రికార్డులలో తప్పుల సవరణ, , వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ , వారసత్వంగా వచ్చిన భూముల మ్యుటేషన్, ఇతర మార్గాల ద్వారా వచ్చిన భూములకు మ్యుటేషన్, సాదా భైనామా క్రమబద్ధీకరణ, పట్టాదారు పాసుపుస్తకాలు, అప్పీలు వ్యవస్థ, రివిజన్ అధికారాలు, గ్రామ రెవెన్యూ రికార్డుల, రికార్డుల నకలు పొందడం ఎలా ఈ అంశాల పై చట్టం రుపుదాల్చిందని, ఈ కొత్త చట్టం పై అందరికీ అర్థమయ్యేలా అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతున్న దని తెలిపారు
అలాగే ప్రతి గ్రామాల్లో గ్రామ రెవెన్యు సదస్సులు త్వరలో నిర్వహించడం జరుగుతుందనీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ లు , అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Comments