నిర్మల్: అక్షర తెలంగాణ
జిల్లా శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేసి నిర్మల్ ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్మల్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులందరితో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు సైతం పెద్ద ఎత్తున నిర్మల్ ఉత్సవాల్లో పాల్గొనే విధంగా విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు. నిర్మల్ జిల్లా చరిత్ర తెలియజెప్పేలా కార్యక్రమాలు ఏర్పాటుచేయాలన్నారు. ఈ నెల 19 వ తేదీ నుంచి 23 వ తేదీ వరకు నిర్వహించబోయే నిర్మల్ ఉత్సవాల కార్యక్రమానికి ప్రోటోకాల్ పాటిస్తూ, ప్రజాప్రతినిధులను, ప్రముఖులను ఆహ్వానించాలని చెప్పారు. సంతకాల బోర్డు, సెల్ఫీ పాయింట్ లు ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండ ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా ప్రజల నుంచి స్వీకరించిన సూచనలను పరిశీలించారు. ఉత్సవాలకు వచ్చే సందర్శకుల సంఖ్యను ముందుగా అంచనా వేస్తూ, అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, డీఈవో భోజన్న, డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సిపిఓ జీవరత్నం, డిపిఓ శ్రీనివాస్, డిఆర్డిఓ విజయలక్ష్మి, డిఎంహెచ్ఓ రాజేందర్, అగ్నిమాపక అధికారి శివాజీ, ఉద్యానవన పంటల అధికారి రమణ, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Comments