సైబర్ క్రైమ్ కేసుల దర్యాప్తుల్లో విస్తుపోయే
వాస్తవాలు వెలుగులోకి
ఆక్షరతెలంగాణ: మోసం ఎక్కడా చూసినా. పెద్ద సమస్యగా మారింది. రుణాలు, మొబైల్ యాప్స్, పెట్టుబడులు, పార్సిల్స్, డిజిటల్ అరెస్టులు..రకరకాల రూపాల్లో ఖాతాల్లో నగదును క్షణాల్లో లాగేస్తున్నారు కేటుగాళ్లు. ఈ సమస్య ఇతర రాష్ట్రాల వారు చేస్తుండడంతో కొద్దో గొప్పో ఈ తరహా మోసాలను ముందే గుర్తించి జాగ్రత్త పడేవారు. కానీ కాలం మారింది... మనవాళ్లే మనకు టోకరా వేస్తున్నారు. ఏకంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లి సైబర్ మోసాలపై శిక్షణ పొంది స్థానికంగా కోట్ల రూపాయలు లూటీ చేస్తున్నారు.
ఓ చిన్న జిల్లా. గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉన్న
ప్రాంతం. అలాంటి ప్రాంతం సైబర్ మోసాలకు
కేరాఫ్ అడ్రస్ గా మారింది. వినడానికి ఇది నిజం.
కొంతమంది చదువును మధ్యలో ఆపేసిన
యువకులు ఈజీ మనీ, జల్సాలకు అలవాటు
పడి ఏకంగా దుస్సాహాసమే చేశారు. అంతేకాదు.
ఆ విషపు అలవాటును ఇంకొంతమందికి
అంటించి అమాయక ప్రజల ధనాన్నిదోచుకుంటున్నారు. ఇటీవల వనపర్తి జిల్లాలో
సైబర్ క్రైమ్ కేసుల దర్యాప్తుల్లో విస్తుపోయే
వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. లోతుగా
దర్యాప్తు చేస్తే స్థానికంగా ఉంటున్న యువతే
సైబర్ క్రైమ్లకు పాల్పడుతున్నట్లు తేలడం
పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. వనపర్తి
పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. వనపర్తి జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, తండాల యువత ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వీరిపై నిఘా పెట్టి ఇప్పటి వరకు 31మంది సైబర్ నేరస్తులను అరెస్టు చేశారు.
ఇతర రాష్ట్రాలకు వెళ్లి సైబర్ మోసాలపై శిక్షణ:
గ్రామీణ ప్రాంతాల్లో జల్సాలకు అలవాటుపడిన నిరుద్యోగ యువతను ఎంపిక చేసుకొని ఈ తరహా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. విలాసవంతమైన జీవనాన్ని అలవాటు చేసి సైబర్ నేరాల రొంపిలోకి దింపుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కోల్ కత్తా, ఢిల్లీ, పాట్నా, యూపీ, రాజస్థాన్ ప్రాంతాలకు వెళ్లి కొంతమంది యువకులు సైబర్ మోసాలపై ట్రైనింగ్ తీసుకున్నారు.
అంతేకాకుండా స్వస్థలాలకు వచ్చి మరికొంతమంది యువకులకు శిక్షణ ఇచ్చి వారి వద్ద నుంచి కొంత కమీషన్లు తీసుకుంటున్నా వీరంతా ధ్వని, ముద్ర పథకాలు, ఇతర బ్యాంకులు, యాప్లలో పెట్టుబడులు,అమాయక ప్రజలకు వల వేస్తున్నారు. వారిని మాటల్లో పెట్టి ఖాతాల్లోని నగదును స్వాహా చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం నమోదైన సైబర్ మోసం కేసులను రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో సహకారంతో వనపర్తి జిల్లా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంత లోనే ఈ లోకల్ సైబర్ ముఠా తెరపైకి వచ్చింది. పదుల సంఖ్యలో మోసగాళ్లు పోలీసులకు ఎట్టకేలకు పట్టుబడ్డారు.
Comments