ఎస్సీ, ఎస్టీ కేసులు, ల్యాండ్ సర్వీస్ కేసులు ఏప్రిల్ నెలాఖరు లోగా పరిష్కరించాలి:ఎస్సీ ఎస్టీ కమీషన్ ఛైర్మెన్ బక్కి వెంకటయ్య.

Madupa Santhosh CEO
ADB: ఎస్సీ, ఎస్టీ కేసులు, ల్యాండ్ సర్వీస్ కేసులు ఏప్రిల్ నెలాఖరు లోగా పరిష్కరించాలి:ఎస్సీ ఎస్టీ కమీషన్ ఛైర్మెన్ బక్కి వెంకటయ్య.Adilabad: అక్షరతెలంగాణ : 
జిల్లా పాలనాధికారి పని తీరు భేష్:ఎస్సీ ఎస్టీ  కమీషన్ ఛైర్మెన్ బక్కి వెంకటయ్య. తెలంగాణ రాష్ర్ట షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల కమీషన్ ఛైర్మెన్  బక్కి వెంకటయ్య కలెక్టరేట్ కు చేరుకున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటిడిఏ పీవో ఖుష్బూ గుప్తా, ఈ ఎస్ పి, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్ , డీఎస్పీ జీవన్ రెడ్డి, డి ఎఫ్ వో ప్రశాంత్ బాజీరావ్ పాటిల్ పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు.అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.
ఎస్సీ ఎస్టీ కమీషన్ ఛైర్మెన్ తో పాటు సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్, కుస్రం నీల దేవి, కొంకటి లక్ష్మి నారాయణ, రాంబాబు నాయక్, జిల్లా శంకర్ లు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ర్ట షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల కమీషన్ ఛైర్మెన్  బక్కి వెంకటయ్య, సభ్యులు , ల్యాండ్ సర్వీస్ ఎస్సీ ,ఎస్టీ,  ప్రత్యేక నిది అట్రాసిటీ, ఆర్ వో ఆర్  పై కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలో మునుపెన్నడూ లేనివిధంగా వినూత్నమైన రీతిలో అభివృధ్ధి పథం లో జిల్లాను ముందుకు తీసుకువెళుతున్న జిల్లా కలెక్టర్ పనితీరును అభినందించారు.
ల్యాండ్ సర్వీస్, అట్రాసిటీస్ పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం కల్పిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరుపై జిల్లా అధికారులతో సమీక్షించి, ఆయా శాఖలలో ఎస్సీ , ఎస్టీ కేసులు వివరాలు, శాఖలలో ఖాళీల వివరాలు, తదితర అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గుడిహత్నూర్ మండలం లో జరిగిన సంఘటన చాలా భాదాకరమని,ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆన్నారు.
ఎస్సీ ఎస్టీలకు అమలుపరుస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను శాఖల వారిగా కమిషన్ చైర్మన్ కు పీపీటీ ద్వారా వివరించారు.
 సమావేశ అనంతరం ఎస్సీ, ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు రాంబాబు నాయక్, జిల్లా శంకర్, కే.నీలాదేవి, లక్ష్మీనారాయణ , తదితరులను కలెక్టర్‌ ఘనంగా స‌త్క‌రించారు .
అనంతరం తెలంగాణ రాష్ట్ర ఎసి, ఎస్టీ కమిషన్  కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో ఆదిలాబాద్ జిల్లా సహకార సెంట్రల్ బ్యాంకు లిమిటెడ్. ఆదిలాబాద్  ఆర్ వో ఆర్   పై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.  కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య  కమిషన్ సభ్యులు ఆర్ వో ఆర్   సమస్యల గురించి దిశానిర్దేశం చేసారు. పలు సమస్యల అర్జీలను స్వీకరించారు. 
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వినోద్ కుమార్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
అట్టి సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి శ్యామల దేవి గ, జిల్లా సహకార అధికారి శ్రీ బి. మోహన్ , జిల్లా ఏ డి సి సి  బ్యాంక్  లిమిటెడ్ఆ దిలాబాద్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి శ్రీ శ్రీధర్ రెడ్డి , బ్యాంకు డైరెక్టర్లు, బ్యాంకు జి.ఎం, డి జి ఎం, ఏ జి ఎం లు మరియు వివిధ సహకార సంఘాల ప్రజా ప్రతినిధులు హాజరు కావడంజరిగింది.
Comments