తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం : రాష్ట్రం లో 28 ఆసుపత్రులను సీజ్ చేసిన.అధికారులు.!

Madupa Santhosh CEO
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం: 28 ఆసుపత్రులు సీజ్ చేసిన అధికారులు 
హైదరాబాద్: అక్షరతెలంగాణ 
వైద్యం చేయకుండానే నకిలీ బిల్లులు సృష్టించిన హాస్పిటల్స్ ను అధికారికంగా సీజ్ చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం .తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి  సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. సి ఎం ఆర్ ఎఫ్ చెక్కుల స్కామ్ కు  పాల్పడిన 28 ప్రైవేట్ హాస్పిటల్స్ మూసివేయనుంది ప్రభుత్వం.
 గత ప్రభుత్వం (బి ఆర్ ఎస్) హయాంలో సంచలనంగా మారిన సి ఎం ఆర్ ఎఫ్ స్కామ్ లో సీరియస్ యాక్షన్ తీసుకుంది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ - 2010 కింద రాష్ట్రవ్యాప్తంగా 28 ప్రైవేటు ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు రద్దు చేశారు. వెంటనే ఈ నిర్ణయాన్ని   అమలులోనికి  తేవాలని సంభందిత    జిల్లా లొ  హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్, పెద్దపల్లి, హనుమకొండ, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించింది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 10 ప్రైవేట్ హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ క్యాన్సల్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో 6, హైదరాబాద్ 4, నల్గొండ 3, మహబూబాబాద్ 2, కరీంనగర్, పెద్దపల్లి, హనుమకొండ జిల్లాల్లో ఒక్కో ప్రైవేట్ ఆసుపత్రుల లైసెన్స్ రద్దు చేశారు.
వైద్యం చేయాకుండా న్  నకిలీ బిల్లులు సృష్టించిన హాస్పిటల్స్.దానికి పర్యవసానం.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నది.
రోగులకు వైద్యం చేయకుండానే నకిలీ బిల్లులతో సి ఎం ఆర్ ఎఫ్ నిధులు కొల్లగొట్టియి ఆయా ప్రైవేట్ హాస్పిటళ్లు. సి ఎం ఆర్ ఎఫ్ (సి.ఎం రిలీఫ్ ఫండ్) కుంభకోణంపై సీరియస్గా ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్ లోతుగా దర్యాప్తు చేయించింది. గతేడాది సీఐడీ విచారణకు ఆదేశించిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్. నింధితులను అదుపులోకి తీసుకుని విచారించింది. ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాల పాత్ర ఉందని తేలడంతో క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆయా హాస్పిటల్ ల ను వైద్యారోగ్య శాఖ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. మరికొన్ని ఆసుపత్రులు పర్యవేక్షణలో ఉన్నట్లుగా సమాచారం.
Comments