ఢిల్లీకి నాలుగో మహిళా సీఎం రేఖా గుప్తా:ఢిల్లీకి నాలుగో మహిళ సీఎం గుప్తా. గతంలో సుష్మా స్వరాజ్ (బీజేపీ), షీలా దీక్షిత్ (కాంగ్రెస్), ఆతిశీ (ఆప్) సీఎంలుగా పని చేశారు. తాజాగా రేఖా గుప్తా (బీజేపీ) ఢిల్లీ ముఖ్య మంత్రిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం దేశంలోని 15 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా, అందరూ పురుష సీఎంలే ఉన్నారు. వ్యూహంలో భాగంగానే ఢిల్లీ పీఠం మహిళకు.
ఢిల్లీ సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. కొద్దిసేపటిక్రితం సమావేశమైన బీజేపీ శాసనసభ పక్షం సీఎం అభ్యర్థిని ఎన్నుకుంది.షాలిమర్ బాగ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తాను బీజేపీ ఎమ్మెల్యేలు సీఎంగా ఎన్నుకున్నారు. రేపు రామ్జీలా మైదానంలో జరిగే కార్యక్రమంలో ఆమె ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు.ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరవుతారు.
ఏ.పి సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఢిల్లీ సీఎం ఎంపిక కోసం కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, బీజేపీ జాతీయ కార్యదర్శి ఓపీ దన్కర్ను బీజేపీ అధిష్టానం నియమించింది. ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమైన ఈ ఇద్దరు పరిశీలకులు శాసనసభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అదే సమయంలో అధిష్టానం నిర్ణయాన్ని సభ్యుల ముందుంచారు.రామ్జీలా మైదానంలో ఆమె ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు
Comments