హైదరాబాద్ : డెస్క్: అక్షరతెలంగాణ
ఆలస్యంగా 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల
తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు బుధవారం మధ్యాహ్నం 2:15 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,విడుదల చేశారు. రవీంద్ర భారతి లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఫలితాలను ఆయన రిలీజ్ చేశారు.
పదవ తరగతి పరీక్ష ఫలితాలలో రాష్ట్ర వ్యాప్తంగా 98.2 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. రెసిడెన్షియల్ స్కూళ్లలో 98.7 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈసారి అనూ హ్యంగా ప్రైవేటు స్కూళ్ల కంటే ప్రభుత్వ రెసిడెన్షియ ల్ స్కూళ్లలో అత్యధిక ఉత్తీర్ణ శాతం నమోదు కావడం విశేషం. బాలురు 91.32 శాతం, బాలికలు 94.26 శాతం ఉత్తీర్ణుల య్యారు.
కాగా, పదో తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 4న ముగిశాయి. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ మేరకు విద్యార్థులు తమ ఫలితాలను ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ https://results.bsetelangana.org లేదా https://రిజల్ట్స్ .bse.telangana.gov.in లో చెక్ చేసుకో వచ్చని అధికారులు వెల్లడించారు.
ఇప్పటి వరకు పదో తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ ఇచ్చేవారు. కానీ, ఇకనుంచి సబ్జెక్టుల వారీగా మార్కు లు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. అదేవిధంగా మార్కుల మెమోలపై కూడా సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు, ఇంటర్నల్ పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడ్లను ముద్రించనున్నారు.
Comments