ADB : క్రీడాకారులకు సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం చేయద్దు-రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివ సేనారెడ్డి.
అదిలాబాద్ : అక్షరతెలంగాణ
గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను గుర్తించి క్రీడల్లో వారిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని ప్రభుత్వం సిద్ధంగా ఉందని అందుకు స్పోర్ట్స్ పాఠశాలలో సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం చేయొద్దని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు.ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన జిల్లా కేంద్రంలోనీ స్పోర్ట్స్ స్కూల్ ను సందర్శించారు.ఈ సందర్భంగా స్కూల్లో ఉన్న సమస్యలను స్వయంగా డివైఎస్ ఓ వెంకటేశ్వర్లును అడిగి తెలుసుకున్నారు.స్పోర్ట్స్ పాఠశాలలోని విద్యార్థులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆ దిశగా వారికి సౌకర్యాలు కల్పించడంలో వెనకడుగు వేయద్దని అన్నారు.హాస్టల్ ను జిమ్ ను సందర్శించిన ఆయన కావలసిన సౌకర్యాల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవిస్తానని స్పష్టం చేశారు.ఆయన వెంట యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి,జైనథ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విలాస్ పటేల్,యువజన కాంగ్రెస్ బేల మండల అధ్యక్షుడు గోడే అవినాష్,కిసాన్ కాంగ్రెస్ బేల మండల అధ్యక్షుడు గాన్ శ్యామ్,మాజీ సర్పంచ్ రూప్ రావు,రమేష్ పటేల్ యువ నాయకుడు ఠాక్రే సాగర్ తదితరులు ఉన్నారు.
Comments